Chandrababu: శపథానికి సంబంధించి చంద్రబాబు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే..

Chandrababu: శపథానికి సంబంధించి చంద్రబాబు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే..
Chandrababu: రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదు.

Chandrababu: ''పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదు.

అదే విధంగా ఇన్నేళ్లు ఎన్నో అవమానాలను భరించాం. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి.. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడ్డాం.. బాధాకరమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా విమర్శించారు.

ఏ పరువు కోసం ఇన్ని సంవత్సరాలుగా పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్‌లోకి తీసుకొచ్చి అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా'' అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది.

Tags

Read MoreRead Less
Next Story