Chandrababu Tour: చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన..

Chandrababu Tour (tv5news.in)

Chandrababu Tour (tv5news.in)

Chandrababu Tour: ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu Tour: ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేనున్నానంటూ వరద బాధితుల్లో ధైర్యం నింపుతున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించన ఆయన.. రాజంపేట, నందలూరు మండలాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. పులపత్తూరు, మందలపల్లి, గుండ్లూరు, తొగురు పేట గ్రామాల్లో తిరిగి బాధితుల కష్టాలు తెలుసుకుంటున్నారు.

మందపల్లిలో తంబల్ల చెంగమ్మ, రామ్మూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. చెయ్యేరు వరదల్లో ఈ రెండు కుటుంబాలు 9మందిని కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల గురించి అలర్ట్‌ చేయడంలో జగన్‌ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు చంద్రబాబు. అన్నమయ్య డ్యాం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైందని.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డంకిగా మారుతుందనే ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తలేదన్నారు.

ముంపు విపత్తుకు స్థానిక ఇసుక మాఫియానే కారణమని.. వరద బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేన్నారు చంద్రబాబు.ఈ ఘటనకు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని, చేతకాక పోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నారు. వరద ముప్పు నుండి అప్రమత్తం చేయలేని సీఎం.. ఆ పదవికి అనర్హుడంటూ ఫైర్‌ అయ్యారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు..

Tags

Read MoreRead Less
Next Story