స్పీకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

స్పీకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అసెంబ్లీ సమావేశాలకు అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించాలని స్పీకర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా.. మీడియా పాయింట్‌ను తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అయిన మీడియాను నిషేధించడం అప్రజాస్వామికమన్నారు.

ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జీవోను జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ జీవోను తప్పుబట్టిందని చెప్పారు. ఇప్పుడు చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం అంతకంటే దారుణమైన చర్యగా భావిస్తున్నామన్నారు చంద్రబాబు. పార్లమెంటు సమావేశాలకు లేని నిషేధం ఇక్కడ ఎందుకు అని ప్రశ్నించారు. చట్ట సభల్లోని అంశాలను ప్రజలకు తెలియకుండా ఉండటానికి మీడియాను నిషేదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సభా కార్యక్రమాలను యథాతథంగా ప్రజలకు తెలియజేసే అవకాశం ఇవ్వడమే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story