సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా? : చంద్రబాబు

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా? : చంద్రబాబు
అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా..

అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అన్నదాతకు బేడీలా అంటూ ఆయన ప్రశ్నించారు. అసలే అక్రమ కేసులు... ఆపై మానవ హక్కుల ఉల్లంఘన అంటూ చంద్రబాబు ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు.

కృష్ణాయపాలెంకు చెందిన దళిత, బీసీ, తదితర రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం సరైంది కాదన్నారు. తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నానని ఈపూరి రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారని చంద్రబాబు చెప్పారు. అయినాసరే పోలీసులు తమ అక్రమ కేసులను సరిచేసుకోకపోగా... అన్నదాతలకు సంకెళ్లు వేయడం తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అవుతుందని చంద్రబాబు అన్నారు. అంతేకాదు రైతు విద్రోహ చర్య అవుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదని... సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా పోలీసు చర్య ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story