Chiranjeevi : సినిమా వివాదం తీవ్రం అవటంతో జగన్ నన్ను పిలిచారు : చిరంజీవి

Chiranjeevi : సినిమా వివాదం తీవ్రం అవటంతో జగన్ నన్ను పిలిచారు : చిరంజీవి
Chiranjeevi : ఏపీలో సినిమా వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi : ఏపీలో సినిమా వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. రెండుమూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ఇండస్ట్రీ వ్యక్తులు లేనిపోని కామెంట్స్ చేయొద్దని కోరారు. సినిమా వివాదం రోజురోజుకు తీవ్రం అవుతుండటంతో.... సీఎం జగనే తనను ఆహ్వానించారన్నారు చిరంజీవి.


ఎగ్జిబిటర్ల ఇబ్బందులు, కరోనాతో ఇండస్ట్రీ చితికిపోయిన తీరును సీఎం జగన్ కు వివరించా అన్నారు చిరంజీవి. సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న జగన్ ఆలోచన మంచిదే అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారన్నారు చిరు. టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నామని.. త్వరలోనే మరో జీవో ఇస్తామని భరోసా ఇచ్చారన్నారు.


ఐదో షోపైనా ఆలోచన చేస్తున్నామని జగన్ చెప్పారన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు త్వరలోనే కమిటీ సమావేశానికి కూడా హాజరవుతామన్నారు చిరంజీవి.

Tags

Read MoreRead Less
Next Story