ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే 1,288 కేసులు
By - Nagesh Swarna |2 April 2021 2:15 PM GMT
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8వేల 815 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 1,288 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 31వేల 116 సాంపిల్స్ పరీక్షించగా.. 1288 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 225, విశాఖలో 191, కృష్ణాలో 164, నెల్లూరులో 118 కేసులు వచ్చాయి.
ఇక కరోనా మహమ్మారితో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అలాగే గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 610 మంది డిశ్యార్జ్ అయ్యారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8వేల 815 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com