'నా భర్తకు ప్రాణహాని ఉంది : దేవినేని ఉమ సతీమణి అనుపమ

నా భర్తకు ప్రాణహాని ఉంది :  దేవినేని ఉమ సతీమణి అనుపమ
రాజమండ్రి జైల్లో తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహానీ ఉందని ఆయన సతీమణి అనుపమ ఆందోళన వ్యక్తం చేశారు.

రాజమండ్రి జైల్లో తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహానీ ఉందని ఆయన సతీమణి అనుపమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులకు ఆమె లేఖలు రాశారు. మైనింగ్ మాఫియా, గూండాలు దేవినేని ఉమను లక్ష్యంగా చేసుకుని, ప్రాణానికి, కుటుంబ సభ్యులకు, ఆస్తిపాస్తులు ముప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేవినేని ఉమపై 27 జూలై 2021న జి.కొండూరు మండలంలో దాడి జరిగిందని.. అక్రమ కేసులో అరెస్ట్ చేసి, రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారని గుర్తు చేశారు.

గతంలో పోలీసుల అదుపులో, ప్రత్యేకించి ఏపీ జైళ్లలో జరిగిన హత్యా ఉదంతాలను పరిశీలిస్తే.. దేవినేని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, అనుచరులు.. దేవినేనికి ప్రాణ హాని ఉందని భయపడుతున్నారని పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడం వల్ల.. దేవినేని ఉమ భద్రతపై తీవ్రమైన సందేహాలు, ఆందోళనలు కలుగుతున్నాయన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మైనింగ్ మాఫియా, గూండాల నుండి తన భర్త దేవినేని ఉమకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని లేఖలో దేవినేని ఉమ సతీమణి అనుపమ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story