కాలునొప్పితో ఆస్పత్రికి వెళ్తే ప్రాణం తీసిన సిబ్బంది

కాలునొప్పితో ఆస్పత్రికి వెళ్తే ప్రాణం తీసిన సిబ్బంది

కాలునొప్పితో ఆస్పత్రికి వెళ్తే కాంపౌండర్‌ ట్రీట్మెంట్ చేశాడు. వచ్చిరాని వైద్యంతో ఓ మహిళ ప్రాణం తీశారు. తిరుపతిలోని ఓబులం ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం ఇది. కాలు నొప్పికి చికిత్స చేయించుకునేందుకు ఓబులం ఆస్పత్రికి వెళ్లిందో మహిళ. డాక్టరుకు బదులు కాంపౌండర్‌ చికిత్స చేశాడు. నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ వికటించి కాసేపటికే ఆమె పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందింది.

ఓబులం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే బాధితురాలి మృతికి కారణమని ఆరోపిస్తున్నారు బంధువులు. కాంపౌండర్‌తో ఎలా వైద్యం చేయిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆస్పత్రి సిబ్బందితో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఓబులం ఆసుపత్రి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story