రియల్ ఎస్టేట్ వ్యాపారి వివాహేతర సంబంధం..ఆ విషయం తెలిసిన భార్య..
By - TV5 Telugu |2 July 2019 8:07 AM GMT
కుటుంబ కలహాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం సమీపంలోని ముదునూరుపాడుకు చెందిన పట్టాభిరామిరెడ్డిని సొంత భార్య, కొడుకులే హత్య చేశారు. ఫ్యామిలీతో గొడవల కారణంగా పట్టాభిరామిరెడ్డి కొంతకాలంగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. రాజమండ్రి హుకుంపేటలోని ఓ అపార్ట్మెంట్లో మరో మహిళతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్నాడు. పట్టాభికి భార్య సూర్యారాణితో ఆర్థిక, కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అర్థరాత్రి భర్త ఆచూకీ తెలుసుకున్న భార్య, కొడుకులు, బావమరది కలిసి అపార్ట్మెంట్కు వెళ్లారు. కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. ఆ తర్వాత బొమ్మూరు పోలీసుల ముందు లొంగిపోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com