ప్రేమించి పెళ్లి చేసుకుని మృగాడిలా మారిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకుని మృగాడిలా మారిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆడపిల్ల పుట్టిందని ద్వేషం పెంచుకున్నాడు.. మృగాడిలా మారాడు.. కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.. అంతటితో ఆగకుండా తన రాక్షస చర్యల గురించి ఎవరికైనా చెబితే కన్నబిడ్డను కూడా చంపేస్తానని బెదిరించాడు.. నిస్సహాయురాలైన ఆ మహిళ భర్త పెట్టే హింసను పంటిబిగువున భరిస్తూ ఉండిపోయింది.. అయినా వాడి రాక్షసత్వం ఆగలేదు. మంచినీళ్లలో యాసిడ్‌ కలిపి తాగించి ఆమెను బతికుండగానే జీవచ్ఛవంలా మార్చేశాడు.. భర్త పెట్టే హింసను తట్టుకోలేక బాధిరాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

విశాఖలోని ఆనందపురం మండలం భీమన్నదొరపాలెం గ్రామానికి చెందిన గంగునాయుడు... విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన అపర్ణ ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2016 ఆగస్టు 26న రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.. ఏడాది వరకు అన్యోన్యంగానే సాగిన వారి కాపురంలో బిడ్డ పుట్టిన తర్వాత కలహాలు మొదలయ్యాయి. అపర్ణ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో గంగునాయుడు రాక్షసుడిగా మారిపోయాడు.. అప్పట్నుంచి భర్త, అత్తింటి వాళ్లు అపర్ణను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు.. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో వేరు కాపురం పెట్టిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయి.. ఓ రోజు మంచినీళ్ల బాటిల్‌లో యాసిడ్‌ కలిపి ఆమెతో తాగించాడు. దీంతో ఆమె పేగులు కాలిపోయాయి.. అపర్ణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ఆమెను కేజీహెచ్‌కి తరలించారు.

కట్టుకున్న భర్తే ఇంతటి దారుణానికి పాల్పడటంతో ఆమె ఇప్పుడు ప్రాణాలతో ఉన్నా జీవచ్ఛవంలా మిగిలిపోయింది. 8 నెలలుగా భర్త పెట్టే చిత్రహింసలు తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని.. 8నెలలపాటు భరిస్తూ వచ్చింది.. చివరకు ప్రాణాలు తీసేందుకు కూడా గంగునాయుడు వెనుకాడకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో వారు ఈనెల 4న విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు.. పెందుర్తి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story