ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారు : జేసీ ప్రభాకర్ రెడ్డి
By - TV5 Digital Team |29 March 2021 9:30 AM GMT
దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి మాత్రమే ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలువైపులా వ్యాప్తిచేసిన ఘనత ఎన్టీఆర్ సొంతమని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని.. వారికి కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ప్రభాకర్ రెడ్డి. రాష్ట్రంలో మార్పు మొదలైందని.. దాని ఫలితాలు త్వరలోనే అందరూ చూస్తారన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com