KA Paul : మూడో రోజుకు చేరిన కేఏ.పాల్ ఆమరణ దీక్ష

KA Paul : మూడో రోజుకు చేరిన కేఏ.పాల్ ఆమరణ దీక్ష
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది.

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ డిమాండ్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ విశాఖలో ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి ప్రమాదకరంగా ఉంటే ప్రభుత్వం పరీక్షలు ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. పొరుగున తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసాయని గుర్తుచేశారు. కొవిడ్ వైరస్ కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని కేఏ పాల్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story