Kiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?

Kiran Kumar Reddy : కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
Kiran Kumar Reddy : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీని కిరణ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సోనియా, రాహుల్‌తో చర్చించనున్నారు.

Kiran Kumar Reddy : ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీని కిరణ్‌ కుమార్‌ రెడ్డి కలవనున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సోనియా, రాహుల్‌తో చర్చించనున్నారు. ఏపీలో పార్టీ పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక, రోడ్‌ మ్యాప్‌ను అధిష్టానానికి అందించనున్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. ఏపీ పీసీసీ బాధ్యతలు నల్లారికి అప్పగిస్తారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఐతే పీసీసీ బాధ్యతలు స్వీకరించేందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి విముఖంగా ఉన్నారని సమాచారం. ఏఐసీసీలో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story