ప్రాణం పోతున్నా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి..

ప్రాణం పోతున్నా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి..
ఊపిరి బిగబట్టి రోడ్డు పక్కన ఆపి హమ్మయ్య అనుకుని ఊపిరి వదిలేశాడు కృష్ణాజిల్లా..

ఓ వైపు స్టీరింగ్ తిప్పుతున్నాడు. మరో పక్క గుండె మెలిపెట్టేస్తుంది.. గుండె లయ తప్పుతున్నా బస్సుని అదుపుతప్పనివ్వలేదు.. ప్రయాణీకుల భద్రత తన ప్రాణం కంటే ముఖ్యమనుకున్నారు. బస్సు అదుపుతప్పుతోందని తెలుస్తోంది. అయినా ఊపిరి బిగబట్టి రోడ్డు పక్కన ఆపి హమ్మయ్య అనుకుని ఊపిరి వదిలేశాడు కృష్ణాజిల్లా జి.కొడూరు మండలానికి చెందిన బస్ డ్రైవర్.

జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగోలుకు చెందిన కృష్ణారావు అనే డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసీ బస్సు తిరువూరు నుంచి విజయవాడకు బయల్ధేరింది. జి.కొండూరు మండలం లక్కిరెడ్డి సమీపానికి రాగానే డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయితే గుండె నొప్పి భరింపరానిదిగా ఉంది. ప్రాణాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయినా అతడు స్టీరింగ్ ని వదలకుండా సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపారు. అనంతరం కొద్ది క్షణాల్లోనే తల వాల్చేశారు. ఏం జరిగిందో అర్థం కాని ప్రయాణీకులు డ్రైవర్ దగ్గరకు చేరేలోపు అతడి ఊపిరి ఆగిపోయింది. మృతదేహాన్ని పోలీసులు మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి కన్నుమూసిన డ్రైవర్ కృష్ణారావు మృతదేహానికి పలువురు నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story