కాసేపట్లో చంద్రబాబు ఇంటికి కర్నూల్ పోలీసులు..!

కాసేపట్లో చంద్రబాబు ఇంటికి కర్నూల్ పోలీసులు..!
ఉదయం కర్నూలు నుంచి బయలుదేరిన వన్ టౌన్ సీఐ బృందం కాసేపట్లో జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకోనుంది.

తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మరికాసేపట్లో కర్నూలు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఉదయం కర్నూలు నుంచి బయలుదేరిన వన్ టౌన్ సీఐ బృందం కాసేపట్లో జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకోనుంది. కర్నూలులో N-440K వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి బయలుదేరారు. చంద్రబాబు ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సుబ్బయ్య అనే లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో CBNపై ఐపీసీ 155, 501(1)(B)(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story