Army Officer Saiteja: సాయి తేజ కుటుంబానికి 'మా' అధ్యక్షుడి సాయం..
Army Officer Saiteja:తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటనలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు 13 మంది ఆర్మీ ఆఫీసర్లు మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఇది దేశానికి ఎంతో తీరని లోటని ఆర్మీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ మృతుల్లో ఒకరైన ఆఫీసర్ సాయి తేజ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. అయితే వారికి అండగా ఉంటానని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు వారికి హామి ఇచ్చారు.
మరణించిన ఆర్మీ ఆఫీసర్ సాయి తేజ కుటుంబానికి సాయం చేయడానికి మంచు విష్ణు ముందుకొచ్చారు. ఫోన్ చేసి సాయి తేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. త్వరలోనే వారిని నేరుగా కలిసి మాట్లాడతానని తెలిపారు. అంతే కాకుండా సాయి తేజ ఇద్దరు పిల్లలకు ఇంజనీరింగ్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తానని తెలిపారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా విష్ణు అప్పుడే పూర్తి చేసినట్టు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com