Nara Lokesh : నారా లోకేష్పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు..!
By - /TV5 Digital Team |20 Oct 2021 8:03 AM GMT
Lokesh : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. నారా లోకేష్పై మంగళగిరి పోలీసులు కేసు పెట్టారు.
Lokesh : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మరో ట్విస్ట్ చేటుచేసుకుంది. నారా లోకేష్పై మంగళగిరి పోలీసులు కేసు పెట్టారు. నిన్న పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్పై దాడి చేశారంటూ కేసు నమోదైంది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. ఇందులో A1గా లోకేష్, A2గా అశోక్బాబు, A3గా ఆలపాటి రాజా, A4గా తెనాలి శ్రావణ్ పేర్లు చేర్చారు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అటు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com