Maoist Shweta : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ ..!

Maoist Shweta : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ ..!
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొర్ర కుమారి అలియాస్‌ శ్వేత విశాఖ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయింది.

Maoist Shweta : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొర్ర కుమారి అలియాస్‌ శ్వేత విశాఖ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణంతో ఉద్యమానికి తీరని నష్టం జరిగిన సమయంలో మరో కీలక నేత లొంగిపోయారు. 2009 నుంచి మావోయిస్టుల ఉద్యమంలో ఉన్న శ్వేత.. గాలికొండ దళంలో మిలీషియాగా చేరింది. పెదబయలు ఏరియాలో కీలక సభ్యురాలిగా ఉన్న శ్వేతపై ఆరు హత్య కేసులతో కలిపి మొత్తం 46 కేసులు ఉన్నాయి. పార్టీలో విభేదాలు రావడం వల్లే లొంగిపోయినట్లు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియాకు తెలిపారు. లొంగిపోయిన శ్వేతపై నాలుగు లక్షల రివార్డు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story