మా జోలికి వస్తే చర్మం వలిచేస్తాం.. రెచ్చిపోయిన మంత్రి అనిల్ కుమార్..!
By - /TV5 Digital Team |20 Oct 2021 6:55 AM GMT
మంత్రి అనిల్ కుమార్ మరోసారి బూతులతో రెచ్చిపోయారు. సీఎం జగన్ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరు వస్తారో రండి తెల్చుకుందామంటూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
మంత్రి అనిల్ కుమార్ మరోసారి బూతులతో రెచ్చిపోయారు. సీఎం జగన్ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరు వస్తారో రండి తెల్చుకుందామంటూ... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ జోలికి వస్తే.. చర్మం వలిచేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గన్ పట్టుకుని తిరగాల్సిన రోజులొచ్చాయన్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలకు భద్రత కరువైందని, ప్రజలకు కూడా భద్రత లేదని అన్నారు. పట్టాభి ఇల్లు, టీడీపీ ఆఫీసులపై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, రేపు తాము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. ఏపీ మరో బీహార్లా మారిందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com