తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్‌ పెట్టాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్‌ పెట్టాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు
వీలైతే తిరుపతి ఉప ఎన్నికలో రీపోలింగ్‌ పెట్టాలన్నారు. అలా సాధ్యంకాకపోతే కనీసం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అయినా తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్‌ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ దొంగ ఓట్లు పడ్డాయన్న రఘురామకృష్ణరాజు.. వీలైతే తిరుపతి ఉప ఎన్నికలో రీపోలింగ్‌ పెట్టాలన్నారు. అలా సాధ్యంకాకపోతే కనీసం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అయినా తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.

పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వేస్తున్న విషయాన్ని స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారి విజయానంద్‌తోనూ వ్యక్తిగతంగా మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో న్యాయం బతికే ఉంది అని నిరూపించాలనుకుంటే గనక ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని, మళ్లీ రీపోలింగ్ పెట్టాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆ పార్టీ ఎంపీలు ఈ విషయంపై గట్టిగా పోరాడాలన్నారు

Tags

Read MoreRead Less
Next Story