ఏపీలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి : రఘురామ

ఏపీలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి : రఘురామ
ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ సమస్యను జగన్ పరిష్కరిస్తారని అశించడేమే తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు. అమరావతి భూములపై హైకోర్టు తీర్పు... జగన్‌ ప్రభుత్వానికి పెద్ద చెంప పెట్టు అని విమర్శించారు. రాజధాని మార్పునకు జగన్‌, మంత్రులు సాకులు సహేతుకంగా లేవని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో... ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. రైతులకు పరిహారం ఇవ్వకుండా దుకాణం సర్దేయాని చూస్తే జైలుకు వెళ్లక తప్పదని రఘురామ హెచ్చరించారు. అమరావతిపై అంతిమ విజయం రైతులదేనని విశ్వాసం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story