ఇకనైనా వాటికి పుల్స్టాప్ పెట్టండి.. సీఎం జగన్ పై లోకేష్ ఫైర్
సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు నారా లోకేష్. మీడియా పై బురద చల్లి బ్లాక్ మెయిల్ చేసే ఫ్యాక్షన్ సంస్కృతికి సీఎం జగన్ ఇకనైనా పుల్స్టాప్ పెట్టాలన్నారు నారా లోకేష్. ఓ వర్గం మీడియా, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను చూపిస్తోందంటూ సీఎం జగన్ అనడం చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచార బాధిత కుటుంబాలకు.. ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను పట్టుకోవడం అటుంచి.. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేని స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ధ్వజమెత్తారు. పదిరోజులు అవుతున్న రమ్యని చంపిన నిందితుడికి శిక్ష ఎప్పుడు పడుతుందని లోకేష్ ప్రశ్నించారు.
ఒక వర్గం మీడియా, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను ఎక్కువ చేసి చూపిస్తోందంటూ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు సీఎం గారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో 8 నెలల్లోనే 3 ఘోరమైన ఘటనలు జరిగాయి.(1/3)#JusticeForRamya pic.twitter.com/XXfejJIJuT
— Lokesh Nara (@naralokesh) August 26, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com