ఇంత మూర్ఖత్వం పనికిరాదు.. సీఎం జగన్పై నారా లోకేష్ ఆగ్రహం..!
సీఎం జగన్కు ఇంత మూర్ఖత్వం పనికిరాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల నిర్వహణపై ఆయన మండిపడ్డారు. టెన్త్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలని 48 గంటల డెడ్లైన్ ఇచ్చామన్న లోకేష్.. తాను లేఖ రాసినందుకే పరీక్షలను వాయిదా వేయడం లేదా అని ప్రశ్నించారు. కరోనా వల్లే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి జగన్ వెళ్లలేదని ఆరోపించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో కరోనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన నారా లోకేష్.. కొవిడ్ వైరస్ కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత మొదలైందని.. సుమారు 80 లక్షల మంది కొవిడ్ థ్రెడ్ లోకి వస్తున్నారని చెప్పారు. కరోనా ట్రీట్ మెంట్ను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com