రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్ ..!

రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్ ..!
Nara Lokesh : ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యచేసుకున్న గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.

Nara Lokesh : ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యచేసుకున్న గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.రేపు కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్లలో గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే లోకేష్ టూర్ సందర్బంగా పోలీసులు గోపాల్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు.

చనుగొండ్లగ్రామానికిచెందిన నాగలక్ష్మి, వేంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు సంతానం. గో్పాల్ మొదటి సంతానం కాగా.. శ్రీనివాస్ రెండవ కొడుకు. గోపాల్ డిగ్రీ చదవి, టీటీసీపూర్తిచేశాడు. వైసీపి ప్రభుత్వం అధికారంలోకివచ్చాక డీఎస్‌సీ వేయకపోవడంతో ... ఉద్యోగంకోసం ఎదురుచూసి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితేఇతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక పోవడంతో ... తమకుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి తమ్ముడు శ్రీనివాస్.. నారా లోకేష్‌కు లేఖ రాశాడు. దీనిపై స్పందించిన లోకేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బుధవారం చనుగొండ్ల గ్రామానికా రానున్నారు.

వృద్దాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు మృతిచెందడంతో గోపాల్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికైనా తమనుప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story