ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,002 కరోనా కేసులు..12 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,002 కరోనా కేసులు..12 మరణాలు
AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,002 కొత్త కేసులు నమోదయ్యాయి. 47,972 మంది నమూనాలు పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story