ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు..20 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు..20 మంది మృతి
Covid Cases InAP: ఏపీలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,746 కొత్త కేసులు నమోదయ్యాయి

ఏపీలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,746 కొత్త కేసులు నమోదయ్యాయి.. 73,341 మంది నమూనాలు పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 20 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,648 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,766 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, గుంటూరులో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,90,656 కేసులు నమోదయ్యాయి. 1,95,8,275 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story