పెయిడ్ బ్యాచ్ను అడ్డుకున్నకృష్ణాయపాలెం రైతుల కేసులో కొత్త ట్విస్ట్
పెయిడ్ బ్యాచ్ను అడ్డుకున్నకృష్ణాయపాలెం రైతుల కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రైతులపై పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటానంటూ.. మంగళగిరి పీఎస్కు ఈపూరి రవి అనే వ్యక్తి వచ్చారు. కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు పోలీసులకు లేఖ కూడా ఇచ్చారు. ఐనా.. పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే కేసు నమోదు చేసినందున.. ఇరువర్గాలు కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అటు.. పోలీసుల తీరుకు నిరసనగా దళిత సంఘాలు మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
మరోవైపు.. పోలీసులు కేసులు కేసులు పెట్టడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాయపాలెం రైతులకు మద్దతుగా భారీగా.. మంగళగిరి పోలీస్ స్టేషన్కు దళిత సంఘాలు, టీడీపీ నేతలు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన 11 మంది రైతులను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com