Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి: పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి: పవన్‌కల్యాణ్‌
Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.

Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్న మాట రావడానికి.. వైసీపీ ప్రభుత్వ పాలనే కారణమన్నారు. ఓట్లు చీలి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు.

ఏపీ భవిష్యత్‌ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని.. ఎవరెవరు కలిసి వస్తారో తనకు తెలియదన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని తెలిపారు. ఏపీ భవిష్యత్‌ కోసం పార్టీలు కలిసి రావాలన్నారు. బీజేపీతో తమకు పొత్తు ఉందన్నారు పవన్‌కల్యాణ్‌. బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. మోదీ, అమిత్‌ షా అంటే తనకు గౌరవం ఉందని.. రోడ్‌ మ్యాప్‌పై సరైన సమయంలో స్పందిస్తానని చెప్పారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదన్నారు పవన్‌.

Tags

Read MoreRead Less
Next Story