ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం దారుణం : రఘురామ కృష్ణరాజు
By - TV5 Digital Team |23 April 2021 8:30 AM GMT
ఏపీలో అద్భుతంగా నడుస్తోన్న సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం దారుణమని వైసీపీ ఎంపీ రఘుకృష్ణం రాజు మండిపడ్డారు.
ఏపీలో అద్భుతంగా నడుస్తోన్న సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. అమూల్ కోసం అరెస్ట్ చేశారా లేక కక్షపూరితంగా అరెస్ట్ చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే అందరి మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే సీఎం జగన్ మీద ఉన్న కేసులు కూడా త్వరగా తేలాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈనెల 27న సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు అంశం తేలిపోతుందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com