Chandrababu: చంద్రబాబు కన్నీటితో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆ పాట..

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu: రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు.

Chandrababu: రాజకీయ నాయకులకు కూడా అభిమానులు ఉంటారు. వారు చేస్తున్న సామాజిక సేవలకు.. ప్రజల కోసం పాటుపడే గుణానికి ఎంతోమంది అభిమానులు అవుతారు. ఆ అభిమానంతో వారికి ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు కూడా. అలాగే చంద్రబాబు కూడా అధికారంలోకి ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంతో సేవ చేసినందుకు ఇప్పటికీ ఆయనను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఒకప్పుడు ఆయన అభిమానులు ఆయన కోసం రాసిన ఓ పాట మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

'శిల మోసే గాయాలే' అన్న పేరుతో చాలాకాలం క్రితం చంద్రబాబు కోసం అభిమానులు ఓ పాట రాశారు. ఇందులో చంద్రబాబు మ్యానరిజం గురించి, ఆయన రాజకీయాల్లో ఎదుర్కున్న ఒడిదొడుకుల గురించి ఈ పాటలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ పాట మరోసారి వెలుగులోకి వచ్చింది.

అధికార పార్టీ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఈరోజు చంద్రబాబు అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోవడమే కాక ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఈ పాటను గుర్తుచేసుకుంటూ ఆయనలాంటి ఒక స్ట్రాంగ్ మనిషి కంటతడి పెట్టుకోవడమేంటి అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story