టీడీపీ ఛలో అయినంపూడి కార్యక్రమం.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అరెస్టు
By - Nagesh Swarna |7 Sep 2020 5:06 AM GMT
టీడీపీ నేతలు, దళిత సంఘాలు కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి చేరుకోనున్నారు. ఈనెల 1న దళిత కుటుంబాన్ని సజీవదహనం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దళిత యువతి నిద్రిస్తుండగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఇంటికి నిప్పుపెట్టారు. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినంపూడిలో దళిత యువతిని, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అటు.. ఛలో అయినంపూడి కార్యక్రమంలో పాల్గొనేందుకు నందిగామ నుంచి విజయవాడ వస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com