తెలుగుదేశం కార్యకర్తల ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు

తెలుగుదేశం కార్యకర్తల ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు
అరెస్టు చేసిన వారి మీద తెలుగుదేశం కార్యకర్తలు ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నర్సీపట్నం, గొలుగొండ మండలం ఏటిగైరంపేట రామాలయం ఘటనలో గుడి ఎదురుగా కిరాణా షాపు నడుపుకుంటున్న పోలిశెట్టి కనకరాజు, పోలిశెట్టి సంతోష్ లను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆఖరికి ఆలయ పుజారి పేరు కూడా ఎఫ్ఐర్ లో పెట్టడం హేయమైన చర్య అని విమర్శించారు.

ఆలయాలపై దాడుల నిందితులను పట్టుకోవడం చేతకాదు కానీ.. అమాయకులను హింసిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారి మీద తెలుగుదేశం కార్యకర్తలు ముద్ర వేసి విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటనతో సంబంధముని చెబుతున్న మరో వ్యక్తి వైసీపీ నేతలతో ఉన్న ఫోటోలు బయటపడ్డాయని.. అలాంటప్పుడు వైసీపీ నేతలే అతని చేత ఇదంతా చేయిస్తున్నారని తామూ అనాలా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story