పాలకుల అవినీతి కుంభకోణాలతో రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థకం : టీడీపీ అధినేత చంద్రబాబు

పాలకుల అవినీతి కుంభకోణాలతో రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థకం : టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్రంలో అటు కరోనా కల్లోలం, ఇటు వరద విపత్తులతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాలకులు అవినీతి కుంభకోణాలతో..

రాష్ట్రంలో అటు కరోనా కల్లోలం, ఇటు వరద విపత్తులతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాలకులు అవినీతి కుంభకోణాలతో.. లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. అప్పులు తెచ్చి, అవినీతి పనులతో సొంత జేబులు నింపుకోవడం కాకుండా సమాజంలో సంపద సృష్టించే ఆలోచనలు పాలకులకు రావాలన్నారు. పరిశ్రమలు తెచ్చి.. ప్రజలకు జీవనోపాధి మార్గాలు పెంచే దిశగా వారి మనసులు మారాలని దీపావళి సందర్భంగా కోరుకుందామంటూ.. టీడీపీ అధినేత ట్వీట్‌ చేశారు.

ఈ పరిస్థితుల్లో ఆశావహ దృక్పథం ఒక్కటే మన జీవితాలలో వెలుగులు నింపుతుందన్నారు చంద్రబాబు. చీకట్లను పారదోలే వెలుగుపూల దీపావళి... తెలుగువారి లోగిళ్లలో ఆనంద దీపావళి కావాలన్నారు. ఈ దీపావళి మీ ఇంట శుభాలు పూయించాలని కోరుకుంటూ.. మీ తెలుగు ఇంటిల్లిపాదికీ పండగు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ అధినేత.

Tags

Read MoreRead Less
Next Story