కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు : చంద్రబాబు

కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు : చంద్రబాబు
కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదన్నారు.

కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. వైసీపీ నాయకులు కావాలని పంచాయతీల్లో అర్ధరాత్రి ఓట్లు లెక్కించేలా చేస్తున్నారని మండిపడ్డారు. అటు.. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు గెలిచేలా కృషి చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని చంద్రబాబు అభినందించారు.

చింతమనేని ప్రభాకర్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రజాతీర్పు సహించలేకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అధికార వైసీపీ కక్ష సాధింపు చర్యలు నిరాటంకంగా కొనసాగిస్తుండటం హేయమన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం మానుకోవాలన్నారు. లేనిపక్షంలో పోలీసులపై న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story