రామరాజ్యమే లక్ష్యంగా పనిచేద్దాం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

రామరాజ్యమే లక్ష్యంగా పనిచేద్దాం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు, కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ 40 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు.

తెలుగువారంతా ఆత్మగౌరవంతో జీవించాలని.. తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రామరాజ్యమే లక్ష్యంగా పనిచేద్దామని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభిమానమే తెలుగుదేశం బలం అని.. కార్యకర్తలు, నేతలు టీడీపీకి కొండంత బలమన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా కార్యకర్తల సంక్షేమానికి పాటుపడుతున్నామని లోకేష్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story