ప్రభుత్వ నిర్లక్ష్యంపై అనుమానాలు కల్గుతున్నాయి : పట్టాభి

ప్రభుత్వ నిర్లక్ష్యంపై అనుమానాలు కల్గుతున్నాయి : పట్టాభి
ఇప్పటి వరకు 140కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా.. ఒక్కరిని ఎందుకు అరెస్టుచేయలేకపోయారని ప్రశ్నించారు పట్టాభి.

హిందువుల్లో భయాన్ని సృష్టించి .. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. నిరుపేద హిందువులను భయపెట్టి మతం మార్చడం రాష్ట్రంలో సర్వసాధారణమై పోయిందన్నారు. ఇప్పటి వరకు 140కి పైగా దేవాలయాలపై దాడులు జరిగినా.. ఒక్కరిని ఎందుకు అరెస్టుచేయలేకపోయారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానంపై అనుమానాలు కల్గుతున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story