Pattabhi : నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా కుటుంబంపై దాడి చేశారు: పట్టాభి

Pattabhi :  నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నా కుటుంబంపై దాడి చేశారు: పట్టాభి
Pattabhi : ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే వైసీపీ నాయకులు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఫైరయ్యారు.

Pattabhi : ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే వైసీపీ నాయకులు దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఫైరయ్యారు. మీడియాకు ఓ వీడియో విడుదల చేసిన పట్టాభి.. తన ఇంటిపై జరిగిన దాడి సహా అన్ని అంశాలను అందులో ప్రస్తావించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన చంద్రబాబు, లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండున్నరేళ్లుగా అనేక అంశాలపై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే తన కుటుంబంపై మూడోసారి దాడి చేశారని పట్టాభి మండిపడ్డారు. గాయపడిన పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసం బాధ్యత గల తండ్రిగా ప్రయత్నిస్తే దానికి కూడా విపరీతార్థాలు తీస్తున్నారని.. పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story