Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
Tirupati: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Tirupati: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, మినీ వ్యాన్ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు చంద్రగిరికి చెందినవారిగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలోని కనుపూరు అమ్మకు పొంగల్‌ సమర్పించుకుని తిరిగి వస్తుండగా.. శ్రీ కాళహస్తి మార్గంలోని అర్ధనారీశ్వరుని ఆలయ సమీపంలో నేషనల్‌ హైవేపై ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story