ఆయనేం చేసేవాడో నాకు తెలియదు.. నాపన్లలో నేను బిజీ: శిల్పాశెట్టి

ఆయనేం చేసేవాడో నాకు తెలియదు.. నాపన్లలో నేను బిజీ: శిల్పాశెట్టి
ఇంట్లో ఇద్దరూ కలిసే ఉన్నా.. మాట్లాడుకోవడానిక్కాని, ఏం చేస్తున్నారో తెలుసుకోవడానిక్కానీ టైమే లేదంటోంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.

ఎవరి ఇష్టం వారిది.. ఎవరి వ్యాపారం వారిది.. ఇంట్లో ఇద్దరూ కలిసే ఉన్నా.. మాట్లాడుకోవడానిక్కాని, ఏం చేస్తున్నారో తెలుసుకోవడానిక్కానీ టైమే లేదంటోంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. తన భర్త రాజ్‌కుంద్రాని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మీద ఛార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరును చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసులకు శిల్ప సమాధానం నమ్మశక్యంగా లేదు. తన భర్త కార్యకలాపాల గురించి తనకేం తెలియదని తేల్చి చెప్పింది.

'నా పనుల్లో నేను బిజీగా ఉండేదాన్ని. రాజ్ కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు. అశ్లీల యాప్‌ల సంగతి కూడా నాకు తెలియదు' అని శిల్ప వెల్లడించారు. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాను విచారిస్తున్న పోలీసులకు కుంద్రా విస్తుపోయే సమాధానం చెప్పారు.. నేను తీసిన కంటెంట్ అసభ్యకరం కావచ్చు.. కానీ అశ్లీలం కాదు అని ఆయన తెలిపారు.. ఈ మాటలకు అర్థమేంటి మహానుభావా అని పోలీసులు తల పట్టుకున్నారు. చేసింది చెత్త పనైనా చేయలేదని ధైర్యంగా చెప్పడంతో పాటు పైగా దాన్ని సమర్ధించుకోవడం చూసి పోలీసులు విస్తు పోతున్నారు. పైగా నేను ఒక్కడినే ఇలాంటివి చేయట్లేదు. ఇంతకు ముందే ఓటీటీ ప్లాట్‌పామ్స్‌లో ఇలాంటి వీడియోలు దర్శనమిస్తున్నాయని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు.

UK కు చెందిన కంపెనీని రాజ్ కుంద్రా, అతని సోదరుడు కలిసి స్థాపించారని పోలీసులు తెలిపారు. ఆ దేశంలో రిజిస్టర్ చేయబడినందున ఇది భారతీయ సైబర్ చట్టాలను తప్పించుకుంటుందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story