RBI : వడ్డీ రేట్లు పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం
By - TV5 Digital Team |4 May 2022 11:45 AM GMT
RBI :రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
RBI :రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 11వందలకు పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైంది. మార్చిలో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. దాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వస్తున్న డేటా పరిశీలిస్తే ఆర్థిక పురోగమనం మందగించిందన్నారు. వస్తు లభ్యత కొరత, మార్కెట్లో ఒడుదొడుకులతో తీవ్రమవుతున్నాయన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com