Aadavallu Meku Joharlu : 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Aadavallu Meku Joharlu : ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ డేట్  ఫిక్స్..!
Aadavallu Meku Joharlu : యంగ్ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''..

Aadavallu Meku Joharlu : యంగ్ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక్క పాట తప్ప మిగిలిన షూటింగ్ అంతా అయిపొయింది. ఇదిలా ఉంటే మేకర్స్ సినిమా థియేట్రికల్ రిలీజ్‌‌‌‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఖుష్బు, రాధిక శరత్​ కుమార్​, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story