Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్..!
Acharya : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆచార్య.. కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమిది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రేపు(ఆదివారం) రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఏప్రిల్ 24న హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్టుగా సమాచారం.. ఇక ఈ ఈవెంట్కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ లుగా రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల. రేజీనా ఓ స్పెషల్ సాంగ్లో మెరుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com