Jayavani : ఆ దర్శకుడి చేతిలో మోసపోయా .. అది నా కెరీర్ కే మచ్చ : జయవాణి

Jayavani :  ఆ దర్శకుడి చేతిలో మోసపోయా .. అది నా కెరీర్ కే మచ్చ : జయవాణి
Jayavani : రండి లక్షాధికారి కండి అనే టీవీ సీరియల్‌‌లో ద్వారా బుల్లితెరకి పరిచయమైంది నటి జయవాణి..

Jayavani : రండి లక్షాధికారి కండి అనే టీవీ సీరియల్‌‌లో ద్వారా బుల్లితెరకి పరిచయమైంది నటి జయవాణి.. ఆ తర్వాత అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో తనకి ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

నలుపు వర్ణంలో ఉన్నావు.. నువ్వు నటిగా సెట్ కావని చాలా మంది అవమానించారని తెలిపింది. ఓ డైరెక్టర్ సినిమా ఉందని తనకి ఫోన్ చేసి ఫోటో షూట్ చేశాడట, ఆ తరవాత ఆ దర్శకుడి నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదని కానీ ఆ ఫోటో షూట్‌‌‌‌కి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని, తెలిపింది. వెబ్‌‌సైట్‌‌లో ఆ ఫోటోలు పెట్టిన వ్యక్తి కూడా ఎవరో తెలియదని పేర్కొంది.

అయితే అవి తన కెరీర్ కే మచ్చగా మిగిలాయని వాపోయింది జయవాణి. కాగా విజయవాడలో జన్మించిన జయవాణి బి.ఏ. వరకు చదివింది. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి ఉండడంతో ఈ రంగంలోకి అడుపెట్టింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించని అనుకున్నంత ఫేం రాకపోవడానికి కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమేనని అంటుంది జయవాణి.

Tags

Read MoreRead Less
Next Story