Aishwaryaa : మాజీ భార్యను ఫ్రెండ్ అన్న ధనుష్.. స్పందించిన ఐశ్వర్య..!

Aishwaryaa : మాజీ భార్యను ఫ్రెండ్ అన్న ధనుష్.. స్పందించిన ఐశ్వర్య..!
Aishwaryaa : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికింది

Aishwaryaa : కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ జంట తమ 18 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికింది. ఇద్దరు విడిపోయాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన సరే అది హాట్ టాపిక్‌‌గా మారుతోంది.

ఇటీవల జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించిన 'పయని' అనే మ్యూజిక్ వీడియోకు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. అయితే ఇందులో తమిళ వెర్షన్‌ను సూపర్‌‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ అయిన 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌‌లాల్ రిలీజ్ చేశారు.

అయితే ఈ వీడియో పైన ఐశ్వర్య మాజీ భర్త ధనుష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.. 'పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించినందుకు నా స్నేహితురాలు ఐశ్వర్యకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్' అని ట్వీట్ చేశాడు. ధనుష్ చేసిన ట్వీట్ అందర్నీ షాక్‌‌కి గురిచేసింది. ఐశ్వర్యని ఫ్రెండ్ అని సంబోధించడం అభిమానులకి నచ్చలేదు.

అయితే ధనుష్ ట్వీట్ పైన తిరిగి ఐశ్వర్య స్పందించింది. "థాంక్ యు ధనుష్.. గాడ్ స్పీడ్" అని రాసుకొచ్చింది. ఇక ధనుష్, ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story