గుడ్న్యూస్ చెప్పిన హీరోయిన్ .. మళ్ళీ..
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 'నికమ్మ' మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇన్స్టా లో పోస్ట్ పెట్టారు. " అవును, ఇది నిజం! 13 సంవత్సరాల నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా.. త్వరలోనే నికమ్మ చిత్రంలో కనిపించబోతున్నాను. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అభిమన్యు, షిర్లేసేతియా వంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి నటిస్తున్నందకు ఆనందంగా ఉంది. నాపై మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి ఇన్నాళ్ళుగా మీరు కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు" అంటూ ఓ వార్తా పత్రిక క్లిప్పింగ్ను జత చేస్తూ ఇన్స్టా ఖాతలో ఓ పోస్ట్ పెట్టారు. 90 వ దశకంలో బాలీవుడ్ ఓ ఊపు ఊపిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్కుంద్రాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు.
అనంతరం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. భర్త రాజ్కుంద్రా ఓనర్గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ టీం బాధ్యతలను చూసుకున్నారు. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్లో కనిపిస్తూ సందడి చేశారు. బిగ్ స్ర్ర్కిన్కు దూరమైన శిల్ప డిజిటల్ ప్లాట్ ఫామ్పై మెరిశారు. యోగా , తన ముద్దుల కుమారుడు వియాన్కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com