Allu Arjun : వైఫ్తో కలిసి సెర్బియాలో అల్లు అర్జున్ గ్రాండ్గా బర్త్డే పార్టీ.. !
Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 40 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు .. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పారు.. ఇక ఇదిలావుండగా ఈ సారి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్.. సుమారు 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి సెర్బియాకు వెళ్ళాడు.. అక్కడ ఫ్రెండ్స్ తన సతీమణితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు బన్నీ ... పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అభిమానుల కోసం ఓ లెటర్ పోస్ట్ చేశాడు బన్నీ.
ఇందులో... 'నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారు, సినీ ప్రేక్షకులు, అభిమానులందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అని రాసుకొచ్చాడు.. కాగా గతేడాది పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ .. ఇప్పుడు పుష్ప పార్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com