Keerthi Suresh : మళ్ళీ తల్లిగా కీర్తి సురేష్.. !

Keerthi Suresh : మళ్ళీ తల్లిగా కీర్తి సురేష్.. !
Keerthi Suresh : టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో..

Keerthi Suresh : టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. వరస ఫ్లాప్ లు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.. ఇటీవల విడుదలైన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కనీసం తన తదుపరి సినిమాతోనైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు శర్వానంద్.

దర్శకుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు శర్వానంద్.. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోవాలని అనుకున్నారు. ఆమెను సంప్రదించగా.. కెరీర్ బిగినింగ్‌లో తల్లి పాత్రలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నో చెప్పిందట.. ఆమె రిస్క్ అనుకున్న పాత్రను ఫేస్ చేయడానికి ఇప్పుడు కీర్తి సురేష్ రెడీ అయిందట.. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి పాత్రలో నటించబోతోందని సమాచారం.

దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది.. కాగా గతంలో 'పెంగ్విన్' సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా నటించింది కీర్తి. కాగా ప్రస్తుతం ఈ మహానటి ఫేమ్.. మహేష్ బాబు హీరోగా వస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళాశంకర్' సినిమాలో మెగాస్టార్ కి సిస్టర్ రోల్ ప్లే చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story