Keerthy Suresh : మొదట్లో నన్ను ఐరన్ లెగ్ అన్నారు : కీర్తి సురేష్
Keerthy Suresh : కెరీర్ మొదట్లో తనకి ఐరన్ లెగ్ అనే ముద్రవేశారని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపింది. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కీర్తి ... మహానటి చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ సఖి చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. హీరోయిన్ గా కెరీర్ మొదలైన రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని, ఒకటి రెండు సినిమాలు ఆగిపోయేసరికి ఐరన్ లెగ్ అనే ముద్రవేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ కొత్త అమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందన్న ప్రచారం కూడా చేశారని చెప్పింది.
ఆ మాటలు మొదట్లో బాధగా అనిపించినా.. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లానని, అదే సక్సెస్ ని ఇచ్చిందని పేర్కొంది. దాంతో తన పైన వచ్చిన విమర్శలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయని తెలిపింది. కాగా ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో వస్తోన్న 'సర్కారు వారి పాట' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కీర్తి. ఇక చిరంజీవి భోళా శంకర్ మూవీలో చిరుకి చెల్లెలుగా కనిపించబోతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com