Mahesh Babu : 'నాన్నగారి బయోపిక్ చేయలేను' : మహేష్ బాబు
Mahesh Babu : హీరోగానే కాకుండా మహేష్ ప్రొడ్యూసర్ గా ఫుల్ ఫామ్లో ఉన్నాడు.. మహేష్ ప్రొడ్యూస్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ మేజర్.. జూన్ 3న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా, శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శోభిత ధూళిపాళ హీరోయిన్గా నటిస్తోంది. మూవీ ప్రొమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ హీరో మహేష్ చేతుల మీదుగా రిలీజ్ అయింది.
ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. అందులో భాగంగా కృష్ణ బయోపిక్ తీసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకి మహేష్ స్పందిస్తూ.. ''నాన్నగారి బయోపిక్ ఎవరన్నా తీస్తే మొదట నేనే ఆనందంగా చూస్తాను. ఆయన నా దేవుడు కాబట్టి నేను అయితే ఆ ప్రయత్నం చేయలేను. ఎవరన్నా డైరెక్ట్ చేస్తే నిర్మించడానికి రెడీ ఉన్నా'' అని చెప్పుకొచ్చాడు.
అటు మహేష్ హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పరుశురాం దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com