Vijayendra Prasad : మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే : విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad : మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే : విజయేంద్రప్రసాద్
Vijayendra Prasad : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే..

Vijayendra Prasad : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ పైన విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

" ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్‌ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ ఏడాది మహేశ్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉంటారు. అందుకే రాజమౌళితో సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలవుతుంది" అని విజయేంద్రప్రసాదద్ చెప్పుకొచ్చారు.

దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీని కంప్లీట్ చేశారు. మే 12న ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పరుశురాం దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Tags

Read MoreRead Less
Next Story